బ్లాక్బస్టర్ సినిమాలను ఎంజాయ్ చేయలేదంటున్న శ్రుతి!
on Sep 30, 2020
శ్రుతీ హాసన్ పాన్ ఇండియా స్టార్. మాతృభాష తమిళం సహా తెలుగు, హిందీ భాషల్లో నటిస్తుంటారు. కమల్ హాసన్ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించినా... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఈ మధ్య హిందీ కంటే తెలుగు, తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. అందుకు కారణం సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి తనకు మంచి క్యారెక్టర్లు వస్తున్నాయని శ్రుతీ హాసన్ అంటున్నారు.
లాక్డౌన్లో 'ఎడ్జ్' సాంగ్ చేయడంతో పాటు ఫిట్నెస్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసిన శ్రుతీ హాసన్, ఇటీవల 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నెట్ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తి చేశారు. త్వరలో రవితేజ 'క్రాక్', తమిళంలో విజయ్ సేతుపతి 'లాభం' చిత్రీకరణ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రెండు సినిమాలు థియేటర్లలోనే విడుదల అవుతాయని శ్రుతీ హాసన్ తెలిపారు. బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన శ్రుతీ హాసన్, అవి చేసేటప్పుడు అంతగా ఎంజాయ్ చేయలేదనీ, ఇక నుండి మనసుకు నచ్చిన సినిమాలు చేయడం మీద దృష్టి పెడతాననీ ఆమె అన్నారు.
Also Read