'సాహో' హీరోయిన్కు ఇన్స్టాగ్రామ్లో 5 కోట్ల మంది ఫాలోయర్లు!
on Jul 10, 2020
'సాహో' గాళ్ శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో ఓ అరుదైన మైలురాయిని అందుకుంది. ఇన్స్టాగ్రామ్లో ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య ఏకంగా 50 మిలియన్ దాటింది. బాలీవుడ్లో 'ఆషికి 2' మూవీతో వెలుగులోకి వచ్చిన శ్రద్ధ, నటిగా తనదైన ముద్రవేసింది. అగ్ర తారల్లో ఒకరిగా ఎదిగింది. పలు సినిమాల్లో ఆమె అందచందాలు, అభినయ సామర్థ్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. ఆమె చక్కని నటి మాత్రమే కాదు, ఒక ఫ్యాషన్ ఐకాన్ కూడా!
సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను ఆమె ఎంజాయ్ చేస్తూ వస్తోంది. ఇవాళ ఇన్స్టాగ్రామ్లో 50 మిలియన్ ఫాలోయర్స్ మార్క్ను చేరుకోవడం ద్వారా ఒక కొత్త మైలురాయిని అందుకుంది. లాక్డౌన్ పీరియడ్లో తన సమయాన్ని ఎలా గడుపుతోందో తరచుగా ఫొటోలు, వీడియోలను షేర్ చేయడం ద్వారా తెలియజేస్తూ వస్తోంది శ్రద్ధ. ఎక్కువగా యోగా, వ్యాయామం చేస్తున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది.
పని విషయానికి వస్తే చివరగా సుశాంత్ సింగ్ రాజ్పుత్తో కలిసి నటించిన 'చిచ్చోరే' సినిమాలో కనిపించింది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరాభిమానాలతో పాటు విమర్శకుల ప్రశంసలూ లభించాయి. ప్రస్తుతం ఆమె లవ్ రంజన్ డైరెక్ట్ చేస్తోన్న టైటిల్ ఖరారుకాని సినిమాలో నటిస్తోంది.
Also Read