ఇస్మార్ట్ బ్యూటీ.. డబుల్ స్ట్రోక్స్!
on Jan 16, 2021
ఇస్మార్ట్ శంకర్ తో తెలుగునాట తొలి బ్లాక్ బస్టర్ చూసిన నిధి అగర్వాల్.. ఈ సంక్రాంతికి కోలీవుడ్ లో డబుల్ ఎంట్రీ ఇచ్చింది. ఒకే రోజు ఆమె నటించిన రెండు సినిమాలు విడుదల కాగా.. రెండు కూడా అమ్మడికి షాకింగ్ రిజల్ట్స్ ఇచ్చాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. నిధి తొలి, మలి తమిళ చిత్రాలు భూమి, ఈశ్వరన్ ఈ పొంగల్ సీజన్ లో ఒకే రోజు (జనవరి 14) జనం ముందుకు వచ్చాయి. జయం రవికి జంటగా నిధి అగర్వాల్ నటించిన భూమి.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విఐపి(ఓటీటీ)లో రిలీజ్ అయి పేలవమైన వ్యూస్, రివ్యూస్ మూటగట్టుకుంది. రైతు సమస్యలపై పోరాటం చేసే ఓ నాసా ఆస్ట్రోనాట్ కథగా తెరకెక్కిన భూమి.. లాక్ లస్టర్ ఎగ్జిక్యూషన్ తో తేలిపోయింది. ఇందులో నిధి పాత్ర చాలా పరిమితంగానే ఉంది. మరోవైపు థియేటర్స్ లో అదే రోజు రిలీజైన శింబు ఈశ్వరన్ కూడా ఔట్ డేటేడ్ సబ్జెక్ట్ తో బాక్సాఫీస్ వద్ద భంగపాటుకు గురైంది. ఇందులోనూ నిధి స్క్రీన్ టైమ్ తక్కువే.
మొత్తమ్మీద.. ఒకే రోజు కోలీవుడ్ లో డబుల్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఇస్మార్ట్ బ్యూటీకి.. డబుల్ స్ట్రోక్స్ తగిలాయన్నమాట. మరి.. రాబోయే కాలంలోనైనా తమిళనాట నిధి విజయకేతనం ఎగురవేస్తుందేమో చూడాలి.
Also Read