ప్రముఖ హిందీ దర్శక-నిర్మాత ఇంట్లో ఇద్దరికి కరోనా
on May 26, 2020
ముంబయ్ సినిమా జనాలకు కరోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎవరి ఇంటి నుండి ఏం వినాల్సి వస్తుందోనని ఆందోళనగా ఉంటున్నారు. షారుఖ్ ఖాన్ స్నేహితుడు, నిర్మాత కరీమ్ మొరానీ సహా ఆయన కుమార్తె, నటి జోయా మొరానీ, మరో కుమార్తెకు కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స తీసుకుని మహమ్మారి నుండి బయటపడ్డారు. తర్వాత శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇంట్లో పనిచేసే ముగ్గురికి కరోనా వచ్చింది. లేటెస్టుగా ప్రముఖ హిందీ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లో పనిచేసే వ్యక్తిగత సిబ్బందికి కరోనా వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు.
సోమవారం (మే 25) కరణ్ జోహార్ పుట్టినరోజు. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, ప్రముఖులు అందరూ అతడికి విషెస్ చెప్పారు. అయితే కరణ్ మాత్రం పుట్టినరోజు చేసుకునే పరిస్థితిలో లేరు. సోమవారం ఉదయం నుండి ఆయన ఇంట్లో కరోనా టెస్టులు సాగాయి. ఇంట్లో పనిచేసే ఇద్దరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించగా పాజిటివ్ అని వచ్చింది. దాంతో ఇంట్లో మిగతా వాళ్లకూ టెస్టులు చేశారు. నెగిటివ్ రావడంతో 14 రోజులు ఐసొలేషన్ లో ఉండాలని డిసైడ్ అయ్యారు. బర్త్ డే రోజు రాత్రి తీరిగ్గా ఈ సంగతి చెప్పారు కరణ్ జోహార్.
Also Read