మహేష్ సినిమాకి డీఓపీ మారాడు!
on Aug 10, 2020
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సర్కారు వారి పాట'. షూటింగ్ మొదలు కాకముందే దీనికి సినిమాటోగ్రాఫర్ మారాడు. పీఎస్ వినోద్ స్థానంలో మధి వచ్చి చేరాడు.
పరశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమాను అధికారికంగా ప్రకటించారు. అప్పుడు పోస్టర్ మీద ఛాయాగ్రహకుడిగా పి.ఎస్. వినోద్ పేరుంది. తాజాగా మహేష్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఛాయాగ్రహకుడిగా మధి పేరుంది.
'సర్కారు వారి పాట' షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. వినోద్ చేతిలో కొన్ని చిత్రాలు ఉన్నాయి. షూటింగులు మొదలైన తర్వాత అవి పూర్తి చేయాలి. అందుకని తాను ఈ సినిమా చేయలేను అని చెప్పి తప్పుకొన్నారట. దాంతో మధిని సంప్రదించగా ఆయన చేతిలో కొత్త చిత్రాలేవీ లేకపోవడంతో వెంటనే ఒప్పుకున్నారు.
Also Read