తెలుగులో రాధిక దంపతుల వెబ్ సిరీస్
on Jul 16, 2020
నటుడిగా కెరీర్ ప్రారంభించిన కొత్తల్లో శరత్ కుమార్ తెలుగులో సినిమాలు చేశారు. 'గ్యాంగ్ లీడర్'లో హీరో మెగాస్టార్ చిరంజీవికి అన్నయ్య పాత్రలో నటించారు. మరికొన్ని సినిమాలు చేశాక తరవాత తమిళంలో సెటిల్ అయ్యారు. మధ్య మధ్యలో అల్లు అర్జున్ 'బన్నీ', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'జయ జానకి నాయక' సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. చాలా రోజుల తరవాత శరత్ కుమార్ ఫుల్ లెంగ్త్ తెలుగు ప్రాజెక్ట్ టేకప్ చేశారు. అందులో ఆయన హీరో. అయితే అది సినిమా కాదు, వెబ్ సిరీస్.
అర్చనా శరత్ రాసిన 'బర్డ్స్ ఆఫ్ ప్రే' నవలను శరత్కుమార్ హీరోగా వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కిస్తున్నారు. గౌతమ్ వాసుదేవ మీనన్ శిష్యుడు ప్రదీప్ నయ్యర్ డైరెక్షన్ లో రాధికా శరత్ కుమార్ దీన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. అలాగే, ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీన్ని ఆహా ఓటీటీ కోసం చేస్తున్నారట. గుబురు గడ్డంతో శరత్ కుమార్ లుక్ కొత్తగా ఉంది.
Also Read