చైతూ - సమంత... మరోసారి....
on Sep 26, 2016
ఏం మాయ చేశావెతో తొలిసారి జోడీ కట్టి ప్రేక్షకుల్ని మాయలో పడేశారు నాగచైతన్య, సమంత. ఆ సినిమాతోనే ఇద్దరూ ప్రేమలో పడిపోయి.. ఇప్పుడు పెళ్లి పీటల వైపు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లోనూ ఈ జంట కనువిందు చేసింది. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరూ కలసి ఓ సినిమా కోసం సంతకం చేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్లో ఘన విజయం సాధించిన చిత్రం.. టూ స్టేట్స్. అర్జున్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు.
అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ రైట్స్ని దక్కించుకొంది. ఈ సినిమాలో చైతూ, సమంతలు జోడీగా కనిపిస్తారని టాక్. ఈ విషయమై అభిషేక్ సంస్థ చైతూతో సంప్రదింపులు జరిపిందని, దానికి చైతూ ఓకే అనేశాడని టాక్. రియల్ లైఫ్ ప్రేమికులు రీల్ లైఫ్లోనూ ప్రేమికులుగా కనిపిస్తే ఆ కిక్కే వేరు. సినిమాకి అదే ప్లస్ పాయింట్ కూడా. అందుకే చైతూ, సమంతలతోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి తీసుకెళ్లాలని చిత్రబృందం బావిస్తోంది. దర్శకుడు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి.