సైరా నిర్మాత రామ్చరణ్ కాదట..!
on Oct 3, 2017
ఖైదీ నెం.150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం "సైరా నర్సింహరెడ్డి"..రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు "ఉయ్యాలవాడ నరసింహరెడ్డి" జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై చిరు తనయుడు రామ్చరణ్ నిర్మిస్తున్నారు. బాహుబలిని మించిన హై టెక్నికల్ స్టాండర్డ్స్తో, భారీ స్టార్ కాస్టింగ్తో సైరాను తెరకెక్కించాలని చెర్రీ కృత నిశ్చయంతో ఉన్నాడు.
అయితే నిర్మాతగా చరణ్ బిజీగా ఉండటంతో సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న రంగస్థలాన్ని దాదాపు పక్కనబెట్టేశాడు. దీంతో ఆ మూవీ షూటింగ్ ఆలస్యమౌతుంది. కానీ ఇలాగే చేస్తూ పోతే సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేమన్న సుకుమార్ విజ్ఞప్తి మేరకు చిత్రీకరణలో పాల్గొంటున్నాడు చెర్రీ..దీంతో సైరా సినిమాకి సంబంధించిన నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో తన భర్తకు అండగా నిలిచింది ఉపాసన..రంగస్థలాన్ని పూర్తి చేసి చరణ్ వచ్చేలోగా..సైరా నర్సింహారెడ్డికి సంబంధించిన నిర్మాణపరమైన వ్యవహారాలను ఉపాసన చక్కబెట్టనుంది. అయితే ఉపాసన సెట్స్ మీదకు వెళ్తుందా అంటే అలాంటిదేమి ఉండదు...కానీ బడ్జెట్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.