సాయితేజ్ ఖాతాలో మరో సుక్కు శిష్యుడు?
on Apr 6, 2021
`సుప్రీమ్` హీరో సాయితేజ్ ఈ వేసవి చివరలో `రిపబ్లిక్`తో పలకరించబోతున్నాడు. వెర్సటైల్ డైరెక్టర్ దేవా కట్టా రూపొందించిన ఈ పొలిటికల్ డ్రామా.. జూన్ 4న థియేటర్స్ లోకి రానుంది. ఐశ్వర్యా రాజేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ఇంప్రెసివ్ గా ఉండడంతో.. `రిపబ్లిక్`పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
ఇదిలా ఉంటే.. `రిపబ్లిక్` తరువాత బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు సాయితేజ్. ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా.. కార్తిక్ కి తొలి చిత్రం కావడం విశేషం. కట్ చేస్తే.. తన నెక్స్ట్ వెంచర్ ని కూడా సుక్కు శిష్యుడి కాంబినేషన్ లోనే చేయబోతున్నాడట సాయితేజ్. ఆ సహాయకుడి పేరు.. జయంత్. ఇటీవల జయంత్ చెప్పిన కథ నచ్చడంతో.. వెంటనే ఓకే చెప్పేశాడట సాయితేజ్. త్వరలోనే సాయితేజ్, జయంత్ కాంబో మూవీపై క్లారిటీ వస్తుంది.
మరి.. సుక్కు శిష్యుడు బుచ్చిబాబు సానా రూపొందించిన `ఉప్పెన`తో సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఘనవిజయం అందుకున్న నేపథ్యంలో.. సాయితేజ్ కూడా అదే బాట పడతాడేమో చూడాలి.
Also Read