సచిన్ సెల్ఫీ తీశాడు. మన వాళ్లు నవ్వారు..!
on Jun 1, 2016
చిరు, నాగ్, అల్లు అరవింద్, మ్యాట్రిక్స్ ప్రసాద్ లు నలుగురూ కలిసి తిరుపతికి వెళ్లారని, అక్కడ సచిన్ ను కలిశారన్న విషయం తెలిసిందే. తిరుపతి దర్శనం కేవలం యాదృచ్ఛికం కాదంటున్నారు సినీజనాలు. గతంలో చిరు అండ్ నాగ్ కలిసి మాటీవీని మ్యానేజ్ చేశారు. అయితే ఆ తర్వాత పార్టనర్ షిప్ నుంచి బయటికొచ్చేశారు. లేటెస్ట్ గా ఇండియన్ ఫుట్ బాల్ లీగ్ లో కేరళ టీమ్ ను వీళ్లందరూ కలిసి కొనుగోలు చేశారు. ఆ కారణంగానే, అందరూ కలిసి తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా అందరూ పసుపు టీషర్ట్స్ వేసుకుని సెల్ఫీ దిగడం విశేషం. సచిన్ సెల్ఫీ తీస్తే, మిగిలిన వాళ్లు స్మైల్స్ ఇచ్చారు. కొత్త వెంచర్ మొదలెట్టిన ఆనందమో ఏమో గానీ, అందరి ముఖాలూ ఎల్ఈడీ ల్యాంపుల్లా వెలిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏదేమైనా మనోళ్ల ఇన్వెస్ట్ మెంట్ ప్లానింగ్ ను మాత్రం మెచ్చుకోవాల్సిందే.