'సాహో'ని కత్తిరించారా?
on Aug 14, 2019
ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులతో పాటు భారతీయ సినీ ప్రేమికులంతా అత్రుతగా ఎదురుచూస్తున్న 'సాహో' సినిమా నిడివిని మొదట అనుకున్న దానికంటే తగ్గించారా? ఫిలింనగర్లో ఇప్పుడు చక్కర్లు కొడుతున్న హాట్ న్యూస్ ఇది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజిత్ డైరెక్ట్ చేసిన 'సాహో' ఆగస్ట్ 30న వరల్డ్ వైడ్గా అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది.
నాలుగు రోజుల క్రితం రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ ఆన్లైన్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ట్రైలర్లో హై స్టాండర్డ్స్తో గ్రాండియర్గా కనిపించిన విజువల్స్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు యాక్షన్ ప్రియులంతా ఫిదా అయ్యారు. కాగా సెన్సార్కు వెళ్లబోయే ముందు ఆ సినిమా నిడివిని తగ్గించారనీ, దీనికి రాజమౌళి సూచనే కారణమనీ చెప్పుకుంటున్నారు. ప్రభాస్కు రాజమౌళి అత్యంత సన్నిహితుడనే విషయం తెలిసిందే. వాళ్లిద్దరిదీ సినిమాలను దాటి వ్యక్తిగతంగానూ పెనవేసుకున్న బంధం. అందుకనే 'సాహో' ఫైనల్ కట్ను చూడాల్సిందిగా ప్రభాస్ అడగ్గానే రాజమౌళి చూశారనీ, సినిమా నిడివి 2.50 నిమిషాల పైనే ఉండటంతో, కొంత ట్రిం చేయాల్సిందిగా ఆయన సజెస్ట్ చేశాడనీ ప్రచారం జరుగుతోంది. ఆయన ఎక్కడెక్కడ ట్రిం చేయమన్నాడో, అక్కడ మూవీని ట్రిం చేయడానికి డైరెక్టర్ సుజిత్ సైతం సంకోచం లేకుండా సరేనన్నాడనీ, ట్రిం చేశాక సినిమా నిడివి 2.30 గంటలు ఉందనీ అనుకుంటున్నారు. దీంతో సినిమా మరింత ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా తయారయ్యిందనేది ఈ గాసిప్ పుట్టించినవాళ్ల మాట. ఈ విషయాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
అయితే ఇది కావాలని ఎవరో పుట్టించిన గాసిప్ మాత్రమేననీ, రాజమౌళి 'సాహో' చూసిన మాట నిజమే కానీ, సినిమా నిడివి తగ్గించాలనే సజెషన్ ఏమీ ఆయన ఇవ్వలేదనీ ఆయన క్లోజ్ సర్కిల్స్ చెబుతున్నాయి.
ఏదేమైనా రోజుకో రకమైన వార్తతో 'సాహో'కు భలే పబ్లిసిటీ వస్తోంది. ఈ పబ్లిసిటీతో దానిపై హైప్ కూడా ఊహాతీతంగా పెరుగుతోంది. బాలీవుడ్లోని పేరుపొందిన నటులు.. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడి వంటివాళ్లు నటించడంతో హిందీ వెర్షన్కూ విపరీతమైన హైప్ వచ్చింది. ఆ హైప్కు తగ్గట్లు 'సాహో' సంచలనాలు సృష్టిస్తుందా? చూడాలి.