'సాహో' నిర్మాతలు 100 కోట్ల లాభం వదిలేసుకున్నారట!
on Aug 19, 2019
'సాహో' విడుదలకు పట్టుమని పది రోజులు కూడా లేదు. ఈ సమయంలో ఎవరైనా నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందని మాట్లాడుకోవాలి. ఎందుకంటే... 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన చిత్రమిది. కానీ, 'సాహో' ఎంత కలెక్ట్ చేస్తే నిర్మాతలకు ఎంత లాభం వస్తుందని ఫిలింనగర్ వ్యాపార వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే... సినిమాకు భారీగా ఖర్చు పెట్టారు. ప్రభాస్ కూడా ఇదే విషయాన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పారు. "సినిమాను జాగ్రత్తగా చేసి ఉంటే 100 కోట్లు లాభం వచ్చింది. కానీ, లాభాన్ని వదిలేసుకుని నా స్నేహితులు సినిమా కోసం ఖర్చు పెట్టారు. అనుకున్నదానికంటే యువి క్రియేషన్స్ సంస్థ భారీగా ఖర్చుపెట్టి సినిమా తీశారు. ఇటువంటి స్నేహితులు అందరికీ ఉండాలి" అని ప్రభాస్ అన్నారు. స్టిల్స్, టీజర్ కంటే ట్రైలర్ విడుదల చేసిన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అదేస్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తొలుత కొందరు ఈ సినిమా పై సందేహాన్ని వ్యక్తం చేసినా... ప్రస్తుతం ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలు చూస్తుంటే ఓపెనింగ్స్ ద్వారా నిర్మాతలకు లాభం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.