ఆడియన్స్ ను టార్గెట్ చేసిన శ్రద్ధాకపూర్!!
on Jun 10, 2019
అవును ఈ రోజు సాయంత్రం `సాహో` సినిమాకు సంబంధించిన బాలీవుడ్ బ్యూటి శ్రద్దాకపూర్ స్టిల్ ఒకటి రిలీజ్ చేసారు. ఇక ఆ స్టిల్ ఆడియన్స్ ను గన్ పెట్టి టార్గెట్ చేసినట్లు ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఆ స్టిల్ కు మంచి లైక్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ ను శ్రద్దాకపూర్ టార్గెట్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రద్ధాకపూర్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య కూడా ఈ బ్యూటి స్టిల్ రిలీజ్ చేసారు. ఇప్పుడు కూడా ఇలా గన్ పట్టుకుని ఉండటంతో శ్రధ్దాకపూర్ పాత్ర కొత్తగా ఉండబోతుందని అర్థమవుతోంది. ఇక ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతుంది. ఇక దీనికి ఆర్ ఆర్ ఎవరు ? చేయబోతున్నారంటూ ఏంటంన్న ప్రశ్నలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. తమన్ ఓకే అయినట్లు ..ఆర్ ఆర్ కూడా ప్రారంభించబోతున్నారంటూ వస్తోన్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. యువి క్రియేషన్స్ పతాకంపై సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.