వేలంలో రికార్డు ధర పలికిన 'యాత్ర' మూవీ టికెట్!!
on Feb 4, 2019
సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 8న విడుదల కాబోతోంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ వైరల్ అవుతోంది. వేలంలో ‘యాత్ర’ సినిమా మొదటి షో టికెట్ ధర 6,116 డాలర్లకు అమ్ముడైంది. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా.. రూ.4.37 లక్షలు. 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్, నిర్వాణ సంస్థలు అమెరికాలోని సీటెల్లో ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్ను వేలం వేశాయి. అందులో మునీశ్వర్ రెడ్డి 6,116 డాలర్లకు మొదటి టికెట్ను సొంతం చేసుకున్నారు. కాగా ఈ డబ్బులను వైఎస్సార్ ఫౌండేషన్కు విరాళంగా ఇస్తామని నిర్మాతలు తెలిపారు.