మైత్రీ మూవీస్ కి షాకిచ్చిన రవితేజ!!
on Nov 17, 2018
ఫెయిల్యూర్ అన్నది ఎరుగని సంస్థగా ఇంత వరకు పేరు తెచ్చుకున్న `మైత్రీ మూవీ మేకర్స్ ` సంస్థకు సవ్యసాచి తో అపజయాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ షాక్ నుంచి మేలుకుంటుండగానే ఇటీవల విడుదలైన రవితేజ `అమర్ అక్బర్ ఆంటోని` చిత్రం ఈ శుక్రవారం విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. సవ్యసాచి ఫలితంతో అటు నాగ చైతన్య ఇటు దర్శకుడు చందుమొండేటి ఇద్దరూ షాకయ్యారు. మూడు వరుస విజయాలతో జోరు మీదున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కు ఈ రెండు చిత్రాలు బ్రేకులు పడేలా చేసాయి.
రవితేజ, శ్రీనువైట్ల లాంటి క్రేజీ కాంబినేషన్ ని నమ్మి చేసినా కూడా ఈ చిత్రం ఫస్ట్ డే టాకే చాలా నెగిటివ్ గా తెచ్చుకుంది. తొలి రోజు కేవలం మూడున్నర కోట్లు మాత్రమే వచ్చాయంటే సినిమా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక సెకండ్ డే సీన్ పూర్తిగా రివర్సైంది. ఇక టాక్సీవాలా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు రవితేజ టైమ్ మళ్లీ మొదటికి వచ్చినట్టైంది. దీంతో మైత్రి వారికి రెండో షాక్ తగిలినట్టైంది. ఇక మీదటనే ఈ సంస్థ ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఉంది.