రవిబాబు నెక్ట్స్ సినిమా ఎవరితోనో తెలుసా..పందితో
on Jun 26, 2016
అల్లరి,అనసూయ, నచ్చావులే, అవును వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన రవిబాబు మరో విచిత్రమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దానికి 'అదిగో' అనే టైటిల్ కూడా కన్ఫార్మ్ చేసాడు ఈ దర్శకుడు. రాజమౌళి "ఈగ" తో సినిమా చేసినట్లు రవిబాబు ఇప్పుడు పందితో సినిమా చేయబోతున్నాడట. అవును.. మీరు విన్నది నిజమే.. ఈ విషయాన్ని స్వయంగా రవిబాబే తెలిపారు. ''ఏడాదిన్నర క్రితం ఈ చిలిపి ఆలోచన వచ్చింది. ఇది వరకు కుక్క, పిల్లి, గుర్రం, కోతి లాంటి జంతువులతో సినిమా తీశారు. కానీ పందిపిల్లతో ఎవ్వరూ తీయలేదు. కొంత యానిమేట్రానిక్స్, కొంత యానిమేషన్, కొంత లైవ్ యాక్షన్... ఇలా సినిమాని ప్లాన్ చేసుకొన్నాం.
ఇలాంటి సినిమాల్ని రామోజీ ఫిల్మ్సిటీలో తప్ప మరెక్కడా తీయలేం. ఫిల్మ్సిటీలోనే మూడు నెలల పాటు షూటింగ్ జరిపాం. అభిషేక్, నాబ హీరో,హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా కమర్షియల్ సినిమానే. హాలీవుడ్లో డిస్నీ సంస్థ ఇలాంటి సినిమాల్ని తీస్తుంటుంది. వాళ్ల సినిమాలు చూస్తే అన్ని వర్గాల వాళ్లకు సంబంధించిన ఏదో ఓ అంశం సినిమాలో కనిపిస్తుంటుంది. 'అదిగో' కూడా అలాంటి సినిమానే. షూటింగ్ కోసం చాలా కష్టపడ్డాం. పందులపై రీసెర్చ్ కూడా చేశాను. ఓ పందిపిల్లను కొన్నాళ్ల పాటు పెంచుకొన్నా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అని చెప్పారు.