విజయ్ దేవరకొండతో మరోసారి రష్మిక?
on Feb 27, 2021
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ సరసన కనువిందు చేసిన నాయికల్లో కన్నడ కస్తూరి రష్మిక మందన్న ఒకరు. `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాల్లో ఈ ఇద్దరు జంటగా నటించారు. వీటిలో `గీత గోవిందం` బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.
కట్ చేస్తే.. ముచ్చటగా మూడోసారి విజయ్, రష్మిక జట్టుకట్టనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్ కి జోడీగా రష్మికని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట సుక్కు. అంతేకాదు.. ఇదో పాన్ - ఇండియా మూవీగా రాబోతోందని సమాచారం. త్వరలోనే విజయ్, రష్మిక థర్డ్ జాయింట్ వెంచర్ పై క్లారిటీ రానుంది.
కాగా, విజయ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ `లైగర్` సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో రష్మిక నటిస్తున్న `పుష్ప` ఆగస్టు 13న రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు కూడా పాన్ - ఇండియా మూవీస్ గానే రాబోతుండడం విశేషం.