దాసూ... మళ్ళీ రష్మికతో జత కట్టేనా బాసు?
on Sep 29, 2020
డాక్టర్ ఎం.కె. దాస్ పాత్రలో నాని నటించిన సినిమా 'దేవ దాస్'. అందులో నానికి జంటగా రష్మిక మందన్న నటించారు. వాళ్ళిద్దరి కాంబినేషన్లో అదే తొలి సినిమా. ఇప్పుడు మరోసారి దాసుతో రష్మిక జంట కట్టే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం నాని 'టక్ జగదీశ్' చేస్తున్నారు. కరోనా వల్ల షూటింగుకి అంతరాయం ఏర్పడింది. త్వరలో మళ్ళీ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లి డిసెంబర్ కి కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తరవాత 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో 'శ్యామ్ సింగ రాయ్' చిత్రీకరణ ప్రారంభించనున్నారు.
'శ్యామ్ సింగ రాయ్'లో నానితో 'ఎంసీఏ'లో నటించిన సాయి పల్లవి హీరోయిన్. కథలో మరో రెండు కీలక పాత్రలు ఉన్నాయట. అందులో ఓ పాత్రకు నిత్యా మీనన్ ను తీసుకోవాలని ముందు అనుకున్నారు. నిత్యా ఏమన్నదో? ఇప్పుడు రష్మికా మందన్నా అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. కథలో కీలకమైన పాత్ర కావడంతో ఆమె ఓకే అంటుందని ఆశిస్తున్నారు. అల్లు అర్జున్ 'పుష్ప'లో రష్మిక హీరోయిన్. ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ బట్టి మిగతావి అడ్జస్ట్ చేసుకోవాలి.