రష్మికతో మాత్రమే అంటున్న టాలీవుడ్ హీరోస్!
on Jun 12, 2019
అవును ఇప్పుడు టాలీవుడ్ లో దర్శక నిర్మాతలతో పాటు హీరోలందరిదీ రష్మిక నామ స్మరణే అయిపోయింది. అసలే తెలుగు సినిమాలో హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యం అంతంతమాత్రమే. ఇక ఏ కొంచెమైనా ఇంపార్టెన్స్ ఉందంటే చాలు ..ఈ పాత్ర రష్మిక అయితే అద్భతంగా పండిస్తుందంటూ ఆమె కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. `ఛలో ` సినిమాతో హలో అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బెంగుళూరు బ్యూటీ తొలి సినిమాతో పర్ఫార్మెన్స్ తో కూడుకున్న హీరోయిన్ పాత్రలకు హీరో అయిపోయింది. ఇక ఆ తర్వాత నటించిన `గీతా గోవిందం`, చిత్రంతో రష్మిక రాత మారిపోతే దేవదాస్ తో ఆమెకు కుర్రకారు దాసులైపోయారు. గీత గోవిందం తో వండ్రఫుల్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మికలు మళ్ళీ `డియర్ కామ్రేడ్` లో జంటగా నటిస్తున్నారు. ఇక కెరీర్ స్టార్టింగ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో ఆమెకు ఎవరూ సరిలేరు అనిపించుకోనుంది. ఇక ఈ రోజు నితిన్ నటిస్తోన్న ` భీష్మ` చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ ప్రతి హీరో `నేను రష్మిక` తోనే నటిస్తాను అని భీష్మించుకుని కూర్చునేలా చేస్తోందీ అందం, అభినయం గల నటి.