నన్ను అలా వాడుకోవడం నచ్చలేదు: రష్మీ
on Jul 8, 2016
నిన్న విడుదలైన రష్మీ తాజా చిత్రం "అంతం"కి విమర్శకులు "సినిమా బాలేదు" అనే స్టాంప్ వేసేసినా.. రష్మీ అందాలను చూడడానికి జనాలు థియేటర్ కి వచ్చేశారు. దాంతో తొలిరోజే ఏకంగా 1.26 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది ఆ సినిమా. అయితే.. థియేటర్ నుంచి బయటకి వస్తున్న ప్రేక్షకుడు మాత్రం మోసపోయానన్న బాధతోనే కనిపిస్తున్నాడు. ఈ విషయంలో హీరోయిన్ రష్మీ చాలా సీరియస్ అయ్యింది.
"అసలు సినిమా కాన్సెప్ట్ ఏమిటన్నది చూపించకుండా, కేవలం నా అందచందాలను మాత్రమే ప్రొజెక్ట్ చేసి ప్రేక్షకుడ్ని థియేటర్ వరకూ తీసుకురావడం సమాజసం కాదు" అని దర్శకనిర్మాత కళ్యాణ్ కు క్లాస్ పీకుతోంది రష్మీ. తొలిరోజంటే పోస్టర్ చూసి ప్రేక్షకుడు సినిమాకి వస్తాడు, ఆ తర్వాత టాక్ ని బట్టి మిగతా రోజుల కలెక్షన్ ఉంటుంది. ఈ లాజిక్ ను దర్శకనిర్మాత కళ్యాణ్ ఎలా మిస్ అయ్యాడో అర్ధం కాలేదు. ఏదేమైనా.. పెట్టిన పెట్టుబడి ప్రకారం "అంతం" కమర్షియల్ గా హిట్ అయినట్లే లెక్క. కాకపోతే.. ప్రేక్షకుడే మోసపోయాడు!