వసూళ్ల గురించి రాయవద్దు - రామ్చరణ్
on May 25, 2018
రంగస్థలం 200 కోట్ల వసూళ్ల మార్కుని దాటేసి రికార్డు సృష్టించింది. అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో మూడో స్థానాన్ని సాధించింది. బాహుబలి 1, 2 తర్వాత స్థానం రంగస్థలానిదే. కానీ రామ్చరణ్ మాత్రం ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకుంటున్నట్లు లేదు. ఒక సినిమాని దాని సత్తాతోనే ప్రజలు గుర్తించాలని అతను కోరుకుంటున్నట్లుంది. అందుకే నిన్న మీడియాతో మాట్లాడుతూ తన సినిమా వసూళ్ల గురించి పోస్టర్ల మీద ప్రచురించవద్దంటూ ప్రొడ్యూసర్లను కోరారు. వాటి గురించి లేనిపోని వివాదాలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.