నితిన్, కీర్తి సురేశ్ జంటగా 'రంగ్ దే' మొదలైంది
on Oct 10, 2019
నితిన్, కీర్తి సురేశ్ తొలిసారి కలిసి నటిస్తోన్న 'రంగ్ దే' మూవీ నిర్మాణ కార్యక్రమాలు విజయ దశమి పండగ రోజు లాంఛనంగా మొదలయ్యాయి. 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను' చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నితిన్, కీర్తి సురేశ్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ క్లాప్ కొట్టగా, ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి మహేంద్ర కెమెరా స్విచాన్ చేశారు. అంతకు ముందు సినిమా దర్శకుడికి నిర్మాతలు దిల్ రాజు, ఎస్. రాధాకృష్ణ స్క్రిప్ట్ అందజేశారు.
దర్శకుడు వెంకీ మాట్లాడుతూ "ఇది లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి. శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకునిగా పనిచేస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే 'రంగ్ దే' కి దేవి శ్రీప్రసాద్ సంగీత స్వరాలు ఓ ఆకర్షణ" అన్నారు. 10వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందనీ, 2020 వేసవి కానుకగా చిత్రం విడుదల అవుతుందనీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
నరేష్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్ తారాగణమైన ఈ చిత్రాని డి.ఓ.పి.: పి.సి. శ్రీరామ్; సంగీతం: దేవి శ్రీప్రసాద్; కూర్పు: నవీన్ నూలి; కళ: అవినాష్ కొల్లా; అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.