'రంగ్ దే' బయ్యర్లకు లాస్ గ్యారంటీ!
on Apr 6, 2021
నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన 'రంగ్ దే' సినిమా బాక్సాఫీస్ దగ్గర 11 రోజులను పూర్తి చేసుకుంది. 'చెక్' మూవీ తర్వాత వరుసగా నితిన్ ఖాతాలో రెండో ఫ్లాప్ నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ 'రంగ్ దే' మూవీ రూ. 13.8 కోట్ల షేర్ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విలువ రూ. 21 కోట్లు. అంటే 11 రోజుల్లో 65.7 శాతం రికవరీ అయ్యింది. 11వ రోజు సోమవారం రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన షేర్ కేవలం రూ. 9 లక్షలు. ఈ ట్రెండ్ను బట్టి రానున్న రోజుల్లో కలెక్షన్ మరింతగా తగ్గిపోతుందనీ, బయ్యర్లు కనీసం 30 శాతం పైగా నష్టాలు చవిచూడటం ఖాయమనీ ట్రేడ్ నిపుణులు అంటున్నారు.
తెలంగాణలో 'రంగ్ దే'పై బయ్యర్లు రూ. 7.6 కోట్లు వెచ్చించగా, రూ. 5.8 కోట్లు రికవరీ అయ్యాయి. అంటే 76 శాతం అన్నమాట. ఆంధ్రలో బయ్యర్లు రూ. 10 కోట్ల పెట్టుబడి పెడితే, వచ్చింది రూ. 5.9 కోట్లు. రికవరీ 59.2 శాతం. రాయలసీమలో రూ. 3.6 కోట్ల పెట్టుబడికి గాను రూ. 2.13 కోట్ల షేర్ వచ్చింది. అంటే రికవరీ అయ్యింది 59.1 శాతం.
సో.. కమర్షియల్గా 'రంగ్ దే' ఫ్లాప్ అనేది తేలిపోయినట్లేనని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. వరుస ఫ్లాపులు ఎదుర్కొని 'భీష్మ'తో హిట్ సాధించిన ఆనందం నితిన్కు ఎక్కువ కాలం నిలవలేదు. నిన్న 'చెక్', నేడు 'రంగ్ దే' అతనికి చేదు అనుభవాలనిచ్చాయి. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి నితిన్ క్యారెక్టరైజేషనే మెయిన్ మైనస్ అనేది విమర్శకుల అభిప్రాయం.