అడవుల్లో రానా అండ్ టీమ్ వెళ్లాలి మరి!
on Oct 15, 2020
దగ్గుబాటి రానా కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'విరాట పర్వం'. ముఖానికి ఎర్రటి కండువా కప్పి రానా లుక్, భారతక్కగా ప్రియమణి రూపం చూసిన తర్వాత ఎవరైనా ఈ సినిమా నేపథ్యం ఏమిటో సులభంగా చెప్పేయవచ్చు. అవును.... మావోయిస్టు నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. అడవి నేపథ్యంలో సన్నివేశాలు ఉంటాయి కదా! అందుకని, త్వరలో రానా అండ్ టీమ్ వికారాబాద్ అడవులకు వెళ్లనున్నారు.
మన దేశంలో కరోనా ఉధృతి పెరగడానికి ముందు ఈ సినిమా చిత్రీకరణ చాలావరకు చేశారు. అప్పట్లో ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలలో సాయిపల్లవి చిత్రీకరణ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి. కరోనా కాస్త తగ్గుముఖం పడుతూ ఉండడంతో చాలామంది చిత్రీకరణలు ప్రారంభిస్తున్నారు. నవంబర్ 1 నుండి విరాటపర్వం చిత్రీకరణ సైతం పునః ప్రారంభం కానుంది. వికారాబాద్ అడవుల్లో ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం.
Also Read