బాహుబలి దిమ్మతిరిగే సినిమా తీస్తున్న వర్మ
on Nov 7, 2016
బడ్జెట్ విషయంలో, వసూళ్ల విషయంలో బాహుబలిని మించిన సినిమా సౌత్ ఇండియాలోనే లేదు. అన్ని సౌత్ ఇండియన్ రికార్డుల్ని బాహుబలి తిరగరాసింది. అయితే... దానికే ఎసరు పెడుతూ, ఇండియన్ రికార్డుల్ని సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఏకంగా రూ.340 కోట్ల బడ్జెట్ తో ఓ సినిమా తీస్తున్నాడు వర్మ.. అదే.. న్యూ క్లియర్. అయితే ఇది తెలుగు సినిమా కాదు.. ఇండియన్ సినిమా అంత కంటే కాదు. ఇదో ఇంటర్నేషనల్ మూవీ. ఇండియా, అమెరికా, రష్యా తదితర దేశాల్లో తెరకెక్కబోతోంది. ఇండియాలో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రమిదే అని వర్మ కూడా అఫీషియల్ గా డిక్లేర్ చేశాడు. దాంతో బాహుబలి, రోబో రికార్డులకు బ్రేక్ పడినట్టైంది.
రాబోయే రోజుల్లో ప్రపంచ యుద్దాలు జలా జరుగుతాయి? న్యూ క్లియర్ బాంబులకున్న శక్తి ఏమిటి? అనే విషయాల్ని ఈసినిమాలో చూపిస్తార్ట. అంటే. ఇది కూడా యుద్ద నేపథ్యంలో సాగే సినిమానే. లేటెస్ట్ టెక్నాలజీని వాడుకోవడంలో వర్మ తరవాతే ఎవరైనా. తన చేతిలో రూ.340 కోట్లు పెడితే ఇంకేమైనా ఉందా? అద్భుతాలు సృష్టించగలడు. ఈసారీ అదే చేస్తాడేమో?? తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసే వర్మ.. ఈసారి భారీ బడ్జెట్ తో, ఇండియా మొత్తం దిమ్మతిరిగిపోయే రేంజులో సినిమా తీస్తున్నాడన్నమాట. వర్మ పని అయిపోయిందనుకొన్న తరుణంలో ఇలాంటి ఆఫర్ పట్టడం గొప్ప విషయమే. మరి వర్మ ఏం చేస్తాడో, ఏం చూపిస్తాడో చూడాలి.