థియేటర్లలో విడుదలయ్యే తొలి తెలుగు సినిమా వర్మదే!
on Oct 1, 2020
అక్టోబర్ 15 నుండి థియేటర్లు తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం పట్ల సంచలన దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. తమ సినిమాను విడుదల చేయనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ 'కరోనా వైరస్' సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్ మే నెలల్లో, ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్న సమయంలో ఆ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు వర్మ. ఎక్కడ ఎప్పుడు ఎలా చిత్రీకరణ చేశాం అనేది చెప్పలేదు కానీ కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ చేశానని వర్మ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
"ఫైనల్లీ... అక్టోబర్ 15 నుండి థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. లాక్ డౌన్ తర్వాత విడుదల అయ్యే తొలి సినిమా 'కరోనా వైరస్' అని ప్రకటించడానికి సంతోషపడుతున్నాను" అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. అగస్త్య మంజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రధారి.