చరణ్, గౌతమ్.. ఓ స్పై థ్రిల్లర్!
on Oct 16, 2021
`మళ్ళీ రావా`(2017)తో దర్శకుడైన గౌతమ్ తిన్ననూరి.. మొదటి ప్రయత్నంలోనే తన ప్రతిభను చాటుకున్నాడు. ఆపై ద్వితీయ చిత్రం `జెర్సీ` (2019)తో మరింతగా ఆకట్టుకున్నాడు. కట్ చేస్తే.. ఈ ఏడాది చివరలో `జెర్సీ` హిందీ రీమేక్ తో పలకరించబోతున్నాడు. షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటించిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా.. డిసెంబర్ 31న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. విజయ దశమి సందర్భంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో గౌతమ్ తిన్ననూరి నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. గత కొద్ది నెలలుగా ఈ ప్రాజెక్ట్ గురించి కథనాలు వచ్చినా.. ఫైనల్ గా అఫిషియల్ అనౌన్స్మెంట్ రావడంతో క్లారిటీ వచ్చేసినట్లయ్యింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. చరణ్, గౌతమ్ ఫస్ట్ జాయింట్ వెంచర్ ఓ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కనుందట. అంతేకాదు.. `మళ్ళీ రావా`, `జెర్సీ` తరహాలో ఈ సినిమా కూడా మూడు డిఫరెంట్ టైమ్ లైన్స్ లో నడుస్తుందని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, 2023 ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశముంది.