రకుల్ పిటీషన్... కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
on Sep 29, 2020
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో డ్రగ్స్ కోణాన్ని వెలికితీసే పనిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బిజీగా ఉంది. ఇప్పటికే కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ సహా కొందరిని అరెస్ట్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్కి సమన్లు ఇచ్చారు. విచారణ చేపట్టారు. అయితే, మీడియాలో డ్రగ్స్ కేసుకు సంబంధించి తన పేరు మీద కథనాలు, వార్తలు ప్రసారం కాకుండా చూడాలని ఢిల్లీ హైకోర్టుకు రకుల్ వెళ్ళారు. ఈ సంగతి తెలిసిందే.
రకుల్ పిటీషన్ స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు, తాజాగా ఈ కేసు విషయమై కేంద్రం సహా కొంతమందికి నోటీసులు జారీ చేసింది. రకుల్ మీద వస్తున్న కథనాలపై చర్యలు తీసుకోవాలని కోరింది. రకుల్ సైతం డ్రగ్స్ తీసుకున్నట్టు సుశాంత్ ప్రియురాలు, ఆల్రెడీ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. డ్రగ్స్ గురించి రియాతో డిస్కస్ చేసిన మాట వాస్తవమే కానీ తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని ఎన్సీబీకి రకుల్ చెప్పిందట. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Also Read