లక్ష్మీ మంచు కోసం... రకుల్ కొత్త చిత్రం!
on Nov 24, 2020
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఆల్రెడీ ఆమె షూటింగులో జాయిన్ అయ్యారట. త్వరలో రకుల్ నటిస్తున్న విషయాన్ని అధికారికంగా వెల్లడించాలని అనుకుంటున్నారు.
మోహన్ బాబుతో రకుల్ నటిస్తుండడం ఇదే తొలిసారి. గతంలో మంచు మనోజ్ సరసన 'కరెంట్ తీగ' చిత్రంలో ఆమె నటించారు. ఇప్పుడు మనోజ్ తండ్రి మోహన్ బాబు చిత్రంలో నటిస్తున్నారు. రకుల్ ఈ చిత్రానికి సంతకం చేయడం వెనక లక్ష్మీ మంచు ఉన్నారని ఫిలిం నగర్ టాక్.
రకుల్, లక్ష్మీ మంచు క్లోజ్ ఫ్రెండ్స్. తన తండ్రి చిత్రంలో ఓ పాత్ర గురించి లక్ష్మీ మంచు వివరించగా... అందులో నటించడానికి రకుల్ అంగీకరించారని గుసగుస. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
