ఈమె మహేశ్ హీరోయిన్.. గుర్తు పడతారా?
on Jan 16, 2021
పూరి జగన్నాథ్ డిస్కవరీగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఓ తార. మొదట కన్నడంలో పునీత్ రాజ్కుమార్ సరసన 'అప్పు' మూవీలో, తర్వాత అదే సినిమా తెలుగు రీమేక్ 'ఇడియట్'లో హీరోయిన్గా నటించి, రెండు భాషల్లోనూ తెరంగేట్రం సినిమాతో సెన్సేషనల్ హీరోయిన్గా మారిందామె. ఆమె.. రక్షిత. 'ఇడియట్' తర్వాత మహేశ్ సరసన 'నిజం', వేణు జోడీగా 'పెళ్లాం ఊరెళితే', జూనియర్ ఎన్టీఆర్తో 'ఆంధ్రావాలా' సినిమాల్లో నటించిన ఆమె 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ను వివాహం చేసుకొని, సినిమాలకు దూరమైంది.
హీరోయిన్గా తన అందచందాలు, హుషారైన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న రక్షిత, వివాహమైన నాలుగేళ్లకు ప్రొడ్యూసర్గా మారి ఇప్పటికే మూడు సినిమాలు నిర్మించి, ప్రస్తుతం నాలుగో సినిమాని నిర్మిస్తోంది. నటిగా ఉన్నంత కాలం తన రూప లావణ్యాలను చక్కగా మెయిన్టైన్ చేస్తూ వచ్చిన ఆమె, ప్రస్తుతం బాగా బరువు పెరిగిపోయింది. ముఖం కూడా చాలా మారిపోయింది. అప్పటి 'ఇడియట్' హీరోయిన్ ఈమేనంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టలేనంతగా మారిపోయిందనేది నిజం.
ఈ ఏడాది సంక్రాంతిని ఆమె తన కుటుంబంతో తమ ఫామ్హౌస్లో గడిపింది. అక్కడి గోవులు, వాటి పిల్లలతో ఆడుతూ గడిపింది. దీనికి సంబంధించిన పలు పిక్చర్స్ను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది రక్షిత. "Namma Sankranthi habba ..... this was the most fun I have had in ages ..... hope u guys have had a super day too .... happy happy Sankranthi to everyone." అంటూ వాటికి క్యాప్షన్ జోడించింది. ఆవు దూడలతో ఆమె ఆడుతున్న ఫొటోలు ఇప్పుడు ఆన్లైన్లో వైరల్గా మారాయి.
Also Read