రెండో రాక్షసుడు వస్తాడు
on Aug 7, 2020
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'రాక్షసుడు'. గతేడాది విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించడానికి దర్శకుడు రమేష్ వర్మ రెడీ అవుతున్నారు. ప్రజెంట్ తన టీమ్తో కలిసి ఆయన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ తరవాత సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు.
యాక్చువల్లీ... తమిళంలో హిట్ అయిన 'రాచ్చసన్'కి రీమేక్గా 'రాక్షసుడు' రూపొందింది. అయితే, సీక్వెల్కి మాత్రం ఒరిజినల్ స్టోరీ ఐడియాతో ముందుకు వెళుతున్నారు. ఇటీవల సినిమా విడుదలైన ఏడాది పూర్తయిన సందర్భంగా టీమ్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. అప్పటికి సీక్వెల్ ఐడియాను హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నిర్మాత కోనేరు సత్యనారాయణకు దర్శకుడు చెప్పారు. వాళ్ళ నుండి అప్రూవల్ కూడా తీసుకున్నారు. ఫస్ట్ పార్ట్ కంటే ఈ సీక్వెల్ ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్ ఇస్తుందని దర్శకుడు చెబుతున్నారు.