పాతికేళ్ల విజయం కలిసొచ్చేనా..!
on May 19, 2017
సరిగ్గా పాతికేళ్ల క్రిందట అగ్ర కథానాయకులు సూపర్ స్టార్ రజనీకాంత్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి లను జతకట్టి అగ్ర దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'దళపతి 'చిత్రం భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తో తిరుగులేని స్టార్లుగా ఎదిగిపోయారు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో మరో సంచలన చిత్రం రాబోతుననట్లు వినికిడి. తాను తయారు చేసుకున్నకొత్త కథకు వారిద్దరు అయితేనే సరిపోతారని భావించిన మణిరత్నం వారితో మళ్ళీ సినిమా చేయాలని నిర్ణయించాడని వినిపిస్తున్నది.
పాతికేళ్ల క్రిందటి 'దళపతి'ని తలపించేలా మణిరత్నం ఈ చిత్రాన్ని తీయనునట్లు ఆలోచనలో ఉన్నాడట. మరి ఈ గొప్ప త్రయం తీయబోతున్న కొత్త సినిమా వార్త ఇప్పుడు దావానలంగా చక్కర్లు కొడుతోంది. మరి ఈ చిత్రం పై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈముగ్గురు ఎవరి పనుల్లో వారు బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం ముందున్న చిత్రాలు పూర్తికాగానే ఈ చిత్రం పట్టాలెక్కవచ్చు. ఈ ముగ్గురు ఈ చిత్రం పై ఎవరు ముందు స్పందిస్తారో చూడాలి మరి. ఈ విషయం మాత్రం అభిమానుల్లో ఆనందాన్ని ఇచ్చింది.