బాలు గొంతు, జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి!
on Sep 25, 2020
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారన్న వార్త వినగానే, సంతాప సందేశాలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. బాలు మృతి ఎంతటి లోటో తెలియజేస్తూ కమల్ హాసన్ ఓ ట్రిబ్యూట్ వీడియో షేర్ చేశారు. రజనీకాంత్ సైతం ఓ వీడియో షేర్ చేసి, ఎస్పీ బాలును తానెలా మిస్సవుతున్నానో, తనకు బాలు పాట పాడటాన్ని ఎంత గౌరవంగా భావిస్తానో చెప్పారు. మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ ఇది గుండెలు బద్దలయ్యే వార్తగా అభివర్ణించారు.
రజనీకాంత్ తన ట్విట్టర్ హ్యాండిల్లో, "రిప్ బాలు సర్. అనేక సంవత్సరాలు మీరు నా గొంతుకగా ఉన్నారు. మీ గొంతు, మీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాతో కలిసి ఉంటాయి. నేను నిజంగా మిమ్మల్ని మిస్సవుతున్నాను" అంటూ ఓ వీడియో షేర్ చేశారు.
కమల్ హాసన్ బాలుతో తన బంధాన్ని తెలియజేసే ఓ వీడియోను షేర్ చేసి, "అన్నయ్య ఎస్పీబీ స్వరం నీడ కింద చాలా కాలం బతకడం నాకు దక్కిన ఒక ఆశీర్వాదం. ఆయన కీర్తి ఏడు తరాల పాటు నిలిచి ఉంటుంది" అని రాశారు.
బాలు ఫొటోను షేర్ చేసిన మోహన్లాల్, "సంగీత ప్రపంచానికి ట్రూ లాస్.. హార్ట్ బ్రేకింగ్. ఆయన అత్మకు శాంతి చేకూరుగాక." అని ట్వీట్ చేశారు.
చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేశ్బాబు, రామ్చరణ్, ధనుష్ లాంటి స్టార్లు సోషల్ మీడియా ద్వారా బాలుకు సంతాపం ప్రకటించారు.