పాకిస్తాన్ వెళ్లేందుకు రాజమౌళి ఉత్సుకత
on Mar 28, 2018
బాహుబలి సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి సంపాదించిన అగ్ర దర్శకుడు రాజమౌళి, ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని దేశాల్ని పర్యటించారు. ఇండియా లోనే కాకుండా, విడుదలయిన ఇతర దేశాల్లో కూడా ప్రభంజనం సృష్టించిన బాహుబలి పుణ్యమా అని పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి అటెండ్ అయ్యే అవకాశం అంది పుచుకున్నాడు. ఇక కొత్తగా, రాజమౌళి కి పాకిస్తాన్ ఫిలిం ఫెస్టివల్ నుండి ఆహ్వానం అందింది. ఈ విషయమై మాట్లాడుతూ, బాహుబలి తనకి కొన్ని దేశాల్ని పర్యటించే అవకాశం ఇచ్చింది అని, అయితే, పాకిస్తాన్ నుండి వచ్చిన ఇన్విటేషన్ తనని అన్నింటి కన్నా ఎక్కువ తృప్తినిచ్చిందని అన్నారు. కరాచీ లో నిర్వహించే ఈ ఈవెంట్ కి తనని ఆహ్వానించినందుకు నిర్వాహకులకు అభినందనలు తెలియజేసాడు జక్కన్న. ప్రస్తుతం, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ సినిమాకి కథ సిద్ధం చేయడంలో బిజీ గా ఉన్న రాజమౌళి, సెప్టెంబర్ కి సినిమాని పట్టాలకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ద్వారా రాజమౌళి మరిన్ని మైలురాళ్లు సాధించాలని కోరుకుందాం.