కంటతడి పెట్టిన రాజమౌళి
on Mar 26, 2017
ఎప్పుడు ముఖం మీద చిరునవ్వుతో తన చుట్టూ ఉన్న వాళ్లతో సరదాగా ఉండే ప్రముఖ దర్శకుడు రాజమౌళి కంటతడి పెట్టారు. బాహుబలి ది కన్క్లూజన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కీరవాణి మాట్లాడారు..ఈ సందర్భంగా తన తమ్ముడు రాజమౌళిని ప్రతిభను కీర్తిస్తూ, ఒక పాటను రచించి, పాడి వినిపించారు. చిరకాలం వర్ధిల్లూ అంటూ పాటతో దీవించారు. ఆ సమయంలో పెద్దన్నయ్య నోటి వెంట ఆ మాటలు విన్న రాజమౌళి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యాడు..దీంతో ఒక్కసారిగా నిర్మాతలు, నటులు, చిత్రయూనిట్ ఆయనను ఓదార్చారు. తండ్రి కన్నీరు పెట్టుకోవడం చూసిన రాజమౌళి కుమార్తె తండ్రిని హత్తుకుని ఏడ్చేసింది..దీంతో వేదిక మీద కాసేపు ఉద్వేగ వాతావరణం నెలకొంది.