ఆ ఇద్దరిలో 'ఆర్ ఆర్ ఆర్' కి ఎవరు ఓకే చెబుతారు
on Apr 10, 2019
రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా నుండి ఎన్టీఆర్ సరసన నటించనున్న డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకున్న విషయం తెలిసేందే. రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ప్రారంభం నుండి.. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్స్ ఎవరు ఉంటారని ఆసక్తికర చర్చ సాగింది. చాలా పేర్లు వినిపించాయి. ఆ సస్పెన్స్ కు తెరదించుతూ పాత్రలని, పాత్రదారులని పరిచయం చేశారు రాజమౌళి. రామ్ చరణ్ సీతారామరాజుగా .. ఎన్టీఆర్ కొమరం భీంగా చేస్తున్నారని ప్రకటించారు. అంతేకాకుండా.. హింది నటుడు అజయ్ దేవగణ్, తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ రామ్ చరణ్ సరసన నటిస్తుందని.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తుందని రాజమౌళి తెలిపారు. ఐతే డైసీ ఎడ్గార్ జోన్స్ ఈ సినిమా నుండి తప్పుకున్న విషయం తెలిసేందే. దీనితో ఆమె ప్లేస్ లో ఎవర్ని తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే రాజమౌళి మాత్రం శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్ లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ప్రభాస్... సాహూ లో శ్రద్ధ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది. దీంతో శ్రద్ధను తీసుకోవాలని సంప్రదింపులు జరుపుతున్నట్లు వినికిడి. ఒక వేళ శ్రద్ధా కపూర్ నో చెబితే జాన్వీ కపూర్ ని తీసుకోవాలనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. అతి త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.