ఓటీటీ నుంచి థియేటర్లలోకి ‘ఒరేయ్ బుజ్జిగా...'
on Dec 4, 2020
రాజ్ తరుణ్ హీరోగా, మాళవిక నాయర్, హెబా పటేల్ హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా' అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నేరుగా ఓటీటీలో విడుదలై ఓ మోస్తరుగా వీక్షకాదరణ పొందింది. కొండా విజయ్కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను నూతన సంవత్సర కానుకగా జనవరి 1న థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కె.కె. రాధామోహన్ తెలియజేస్తూ, "2021కి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర కానుకగా మా బేనర్లో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్టైనర్ 'ఒరేయ్ బుజ్జిగా..'ను జనవరి 1న గ్రాండ్గా విడుదలచేస్తున్నాం" అన్నారు.
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: శేఖర్, ఆర్ట్: టి.రాజ్కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కొండా విజయ్కుమార్.