'మురుగన్'గా రాబోతున్న రఘు కుంచే
on Jul 3, 2020
ఒక పీరియడ్ ఫిల్మ్ను నిర్మించేందుకు గోగో మూవీస్ బ్యానర్ సన్నాహాలు చేస్తోంది. 29 ఏళ్లుగా జైలులో మగ్గిన ఒక స్త్రీ ఎమోషనల్ జర్నీ ఈ సినిమా కథ. ఆ క్యారెక్టర్ను ఒక పేరుపొందిన హీరోయిన్ చేయనుండగా, మురుగన్ అనే ఆమె భర్త పాత్రను మ్యూజిక్ డైరెక్టర్ నుంచి నటుడిగా మారిన రఘు కుంచే చేయనున్నాడు. ఇది భారీ పేలుడును దాచిపెట్టుకున్న ఒక అందమైన ప్రేమకథ అని చిత్ర బృందం చెబుతోంది.
21 మే 1991న జరిగిన కథగా ఈ సినిమా మన ముందుకు రానున్నది. 'కథా నళిని' అనే టైటిల్తో నిర్మాణమయ్యే ఈ సినిమాను కొక్కిరిగడ్డ మహేంద్ర డైరెక్ట్ చేయనున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా రూపొందనున్నది. 'పలాస 1978' మూవీలో విలన్గా కనిపించి మెప్పించిన రఘు కుంచేకు ఇప్పుడు మరో అర్థవంతమైన పీరియడ్ సినిమాలో మరో మంచి పాత్ర లభించినట్లే కనిపిస్తోంది.
Also Read