భరణి దర్శకత్వంలో కె.రాఘవేంద్రరావు?
on Nov 26, 2020
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన పలు చిత్రాల్లో కీలక భూమికలను ధరించారు సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి. కట్ చేస్తే.. ఇప్పుడు భరణి దర్శకత్వంలో రాఘవేంద్రరావు నటించబోతున్నారట. అది కూడా అతిథి పాత్రలో కాదు.. ప్రధాన పాత్రలో.
ఆ వివరాల్లోకి వెళితే.. స్వర్గీయ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, వెటరన్ యాక్ట్రస్ లక్ష్మి కాంబినేషన్ లో మిథునం వంటి అవార్డ్ విన్నింగ్ మూవీని తెరకెక్కించిన భరణి.. సుదీర్ఘ విరామం తరువాత మెగాఫోన్ పట్టనున్నారట. కె.రాఘవేంద్రరావుని దృష్టిలో పెట్టుకుని మిథునంలాగే ఓ వైవిధ్యభరిత కథాంశాన్ని తయారుచేసుకున్నారట భరణి. స్క్రిప్ట్ నచ్చడంతో దర్శకేంద్రుడు కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కె. రాఘవేంద్రరావు వయసుకు తగ్గట్టే హుందాగా ఉండే పాత్ర ఇదని సమాచారం.
మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
