ఒకేసారి ముగ్గురితో మహేష్...
on Jun 22, 2018
ఆగండి ఆగండి అక్కడే ఆగండి నాకు తెలుసు మహేష్ ఏమిటి ఒకేసారి ముగ్గురుతో ఏమిటి అని మీరు రకరకాలుగా ఆలోచిస్తున్నారని. అసలు విషయం ఏమిటంటే... ‘భరత్ అనే నేను’ చిత్రం తర్వాత సూపర్స్టార్ మహేష్బాబు నటిస్తున్న రీసెంట్ చిత్రానికి దర్శకుడు వంశీ పైడిపల్లి. నిర్మాతలు మాత్రం ముగ్గురు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ డెహ్రడూన్లో జరుగుతోంది. మహేష్బాబుకి ఈ చిత్రం 25వ చిత్రం కావడంతో ఈ మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టాడంట మహేష్. ఈ చిత్రాన్ని తెలుగు సినిమా ఇండట్రీలో బడా నిర్మాతలుగా పేరు సంపాదించుకున్న దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మిస్తుండగా వీరితో పాతో మరో నిర్మాత పొట్లూరి వరప్రసాద్ కూడా ఈ చిత్రానికి మూడో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ సినిమా రైట్స్ తనవే అంటూ కోర్టుకు వెళ్ళిన వరప్రసాద్ ఇప్పుడు ఈ సినిమాకి భగస్వామి అవ్వడం మహేష్ ఫ్యాన్స్కి చాలా ఆనందంగా వుందట. సో. మొత్తానికి మహేష్ బాబు ఒకే సారి ముగ్గురుతో అదేనండి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్ మరియు పీవీపీ ఈ మూడు బ్యానర్స్తో నటిస్తున్నాడు.