'పుష్ప'లో విక్రమ్?
on Nov 24, 2020
'ఆర్య', 'ఆర్య 2' తరువాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'పుష్ప'. తెలుగుతో పాటు మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అందుకు తగ్గట్టే.. ఆర్టిస్ట్ లను ఎంచుకుంటోంది యూనిట్. మరీ ముఖ్యంగా.. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ ని విలన్ వేషంలో నటింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కాల్షీట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో.. ఉపేంద్ర, సుదీప్, ఆర్య వంటి పేర్లు ఈ పాత్ర కోసం పరిశీలనలోకి వచ్చాయి.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. గత కొంతకాలంగా చియాన్ విక్రమ్ తో సంప్రదింపులు జరుపుతోందట సుక్కు అండ్ టీమ్. అభినయానికి అవకాశమున్న పాత్ర కావడంతో విక్రమ్ కూడా సానుకూలంగా స్పందించారని టాక్. త్వరలోనే 'పుష్ప'లో విక్రమ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా 'పుష్ప'లో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. 2021లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
