బాలయ్య, డా.రాజశేఖర్ కలవనున్నారు!
on Oct 16, 2017
నందమూరి బాలకృష్ణ, డా.రాజశేఖర్ ఒకేసారి కనిపిస్తే... ఆడియన్స్ కి ఎలా ఉంటుంది. మాస్ ప్రజానీకానికైతే.. నిజంగా పండగే కదా! అవును వారిద్దరూ కలిసి కనిపించబోతున్నారు. ఇది పచ్చి నిజం. బాలయ్య ‘లెంజెడ్’ సినిమాతోనే జగపతిబాబుకి విలన్ గా కెరీర్ మొదలైంది. ప్రజెంట్ లో ఆయన నంబర్ వన్ విలన్. అలాగే... రాజశేఖర్ కూడా బాలయ్య సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడా? అనే అనుమానం ఎవరికైనా రాకమానదు. అదే జరిగితే.. నిజంగా ప్రేక్షకులకు కన్నుల పంటే. కానీ.. ఇక్కడ జరిగేది అది కాదు. త్వరలో వారిద్దరూ ఒకే వేదిక పంచుకోబోతున్నారు.
రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందున్న చిత్రం ‘గరుడ వేగ’. ప్రవీణ్ సత్తార్ దర్శకుడు. 25 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నవంబర్ 3న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ కి ఇప్పటికే మంచి స్పందన లభిస్తోంది. రేపు హైదరాబాద్ ఆర్కే సినీ మ్యాక్స్ లో ‘గరుడ వేగ’ టీజర్ ని విడుదల చేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బాలయ్య రానున్నారు. ఆయన చేతుల మీదుగా ఈ టీజర్ ని విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా జనాలకు బాలయ్య, రాజశేఖర్ కలిసి కనిపించబోతున్నారు. అదన్నమాట విషయం.