మహాశివరాత్రికి వెల్లడికానున్న పీఎస్పీకే 27 టైటిల్!
on Feb 25, 2021
పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. పీరియడ్ ఫిల్మ్గా తయారవుతున్న ఈ సినిమా కోసం 17వ శతాబ్ద కాలాన్ని తలపించే వాతావరణంతో ఓ గ్రాండ్ సెట్ను నిర్మించి, అందులో పవన్ కల్యాణ్, విలన్ గ్యాంగ్పై భారీ యాక్షన్ ఎపిసోడ్ను తీస్తున్నారు. ఫిబ్రవరి 22 నుంచి అక్కడ ఈ సీన్స్ తీస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ను ఎప్పుడు ప్రకటిస్తారా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రెండు వారాల్లో వారి ఎదురుచూపులు ఫలించనున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన ఈ మూవీ టైటిల్తో పాటు, ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయాలని క్రిష్ బృందం నిర్ణయించుకుంది. ఇదివరకు ఈ సినిమా కోసం నిర్మాత ఎ.ఎం. రత్నం 2019లోనే 'విరూపాక్ష' అనే టైటిల్ను రిజిస్టర్ చేయించారు. అయితే ఇప్పుడు ఆ టైటిల్ ప్రకటిస్తారా, మరో టైటిల్ ఖాయం చేశారా అనే విషయం త్వరలో వెల్లడి కానున్నది.
ప్రస్తుతానికి ఈ సినిమాని 'పీఎస్పీకే 27'గా పిలుస్తున్నారు. 2020 మార్చిలో లాక్డౌన్ విధించడానికి ముందే వేరే సెట్లో 15 రోజుల పాటు ఓ షెడ్యూల్ను నిర్వహించారు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్గా నటిస్తున్నాడు.
Also Read