అమ్మాయిని వేధిస్తున్న టాలీవుడ్ నిర్మాత
on Feb 25, 2017
ఈమధ్య చిత్రసీమని వివాదాలూ, కేసులూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రతీ రోజూ.. ఏదో ఓ రూపంలో చీకటి కోణం బయటపడుతూనే ఉంది. తాజాగా ఓ యువ నిర్మాతపై అమ్మాయిల్ని వేధిస్తున్నాడన్న అభియోగంతో కేసు నమోదైంది. సింహా, నా ఇష్టం లాంటి సినిమాల్ని రూపొందించారు పరుచూరి ప్రసాద్. ఆయన తనయుడు పరుచూరి కిరీటీ కూడా నిర్మాతే. తాజాగా సునీల్ తో ఉంగరాల రాంబాబు అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పుడు పరుచూరి కిరీటిపై కేసు నమోదైంది. గత మూడు నాలుగు రోజులుగా జూబ్లిహిల్స్, ఫిల్మ్ నగర్ వీధుల్లో నిర్లక్ష్యంగా, అతివేగంగా నడుపుతున్నాడని పోలీసులు గుర్తించారు. దాంతో పాటు.. ఓ ఉన్నతాధికారి కుటుంబానికి చెందిన అమ్మాయి వెంట పడుతున్నాడన్న అభియోగం కూడా ఉంది. ఈ విషయంపై కిరీటిని పోలీసులు ప్రశ్నిస్తే షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడట. కారులో పోకోమెన్ ఆట ఆడుతున్నానని, అందుకే వేగంగా వెళ్తున్నానని చెప్పాడట. ఆట ఆడుతూ కారు నడపడం ఏమిటి?? ఇది మరీ దారుణం. అందుకే పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకొన్నారని తెలుస్తోంది.