బాలయ్యతో పాటు వెంకీతోనూ..
on Mar 8, 2021
`సీమ టపాకాయ్`తో తెలుగువారికి చేరువైన కథానాయిక పూర్ణ. ఆపై `అవును`తో నటిగా మంచి గుర్తింపు పొందిన ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. తనకు ప్రతిభకు తగ్గ స్థాయినైతే అందుకోలేపోయింది. తాజాగా `పవర్ ప్లే`తో పలకరించిన పూర్ణ.. ప్రస్తుతం రెండు స్టార్ టికెట్ ఫిల్మ్స్ లో కీలక పాత్రల్లో నటిస్తోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఓ యాక్షన్ డ్రామాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. పద్మావతి అనే శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వనుంది పూర్ణ. అలాగే.. మాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ `దృశ్యం 2`కి రీమేక్ గా అదే పేరుతో విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో పూర్ణ కనిపించనుంది. జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ లో వెంకీకి జంటగా మీనా నటిస్తోంది. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ రెండు సినిమాలతో నటిగా మరింత గుర్తింపు దక్కుతుందన్న ధీమాతో ఉంది పూర్ణ.
మరి.. బాలయ్య, వెంకీ చిత్రాలు పూర్ణ కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.