15 రోజుల షెడ్యూల్ కోసం అక్టోబర్లో ఇటలీకి వెళ్తున్న 'రాధే శ్యామ్' టీమ్
on Sep 23, 2020
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ 'రాధే శ్యామ్'. కొన్ని వారాల క్రితం రిలీజ్ చేసిన పోస్టర్తో ఈ చిత్రం చుట్టూ హైప్ తారాస్థాయికి చేరుకుంది. ప్రభాస్ ప్రస్తుతం దేశంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో ఒకడు. యువతరం హార్ట్త్రోబ్. అంతేనా, ప్రతి నిర్మాత/ దర్శకుల జాబితాలో మోస్ట్ వాంటెడ్ యాక్టెర్. అభిమానులను ఉత్తేజపరిచే విషయం ఏమిటంటే, ఈ సినిమా పోస్టర్లో పూజా హెగ్డేతో అతని కెమిస్ట్రీ.
'రాధే శ్యామ్' షూటింగ్ ఈ ఏడాది జనవరిలో ఇటలీలో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి భయం ఉన్నప్పటికీ జార్జియాలో రెండో షెడ్యూల్ వారం రోజుల పాటు జరిపారు. షెడ్యూల్ సజావుగా జరిగినందుకు దర్శకుడు రాధాకృష్ణకుమార్ జార్జియా అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపాడు. తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ బృందం 'రాధే శ్యామ్' కు సంబంధించి మరో ఔట్డోర్ షెడ్యూల్ కోసం ఇటలీకి వెళ్లనున్నది. ఇది 15 రోజుల షెడ్యూల్ అనీ, వచ్చే నెలలో దీనిని జరపాలనీ మేకర్స్ భావిస్తున్నారనీ సమాచారం. వీసాల కోసం ఇప్పటివరకు టీమ్ వేచి ఉన్నట్లు తెలిసింది. ప్రతి ఒక్కరికీ వీసాలు వచ్చేశాయి. యూరప్ బ్యాక్డ్రాప్లో జరిగే అందమైన లవ్ స్టోరీ కావడంతో యూరప్లోని వివిధ దేశాలలో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతున్నారు.
'రాధే శ్యామ్' లో ప్రభాస్, పూజా హెగ్డేతో పాటు భాగ్యశ్రీ, సచిన్ ఖేడేకర్ , ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్ , సత్యన్ నటిస్తున్నారు. 2020 డిసెంబర్ నాటికి ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. పీరియడ్ రొమాంటిక్ డ్రామాగా తయారవుతున్న ఈ చిత్రాన్ని 2021 సమ్మర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read