2022 ఏప్రిల్ కేరాఫ్ ప్రభాస్, తారక్ పాన్ ఇండియా మూవీస్!
on Apr 14, 2021
'బాహుబలి' సిరీస్ తరువాత దక్షిణాదిన పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ ఊపందుకుంది. మరీ ముఖ్యంగా.. తెలుగునాట ఈ తరహా చిత్రాల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దాదాపు స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా బాట పట్టారు. అందుకే ఏడాదికి ఒకట్రెండు పాన్ ఇండియా మూవీస్ అన్నట్లుగా ఉన్న ఈ ట్రెండ్.. ఇప్పుడు నెలకు రెండు పాన్ ఇండియా మూవీస్ అన్నట్లుగా తయారవుతోంది. ఈ ఏడాది జూలైలో ఇలానే రెండు పాన్ ఇండియా మూవీస్ రాబోతున్నాయి. జూలై 16న 'కేజీఎఫ్ చాప్టర్ 2' రానుండగా.. జూలై 30న 'రాధేశ్యామ్' సందడి చేయనుంది.
కట్ చేస్తే.. 2022 ఏప్రిల్ నెలలో ఇలా రెండు వారాల గ్యాప్ లో రెండు పాన్ ఇండియా మూవీస్ రాబోతున్నాయి. ఏప్రిల్ 14న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ సాగా 'సలార్' కన్ఫామ్ కాగా.. తాజాగా యంగ్ టైగర్ యన్టీఆర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ సెకండ్ జాయింట్ వెంచర్ కూడా అదే నెల 29న థియేటర్లలో సందడి చేయనున్నట్లు ప్రకటన వచ్చింది.
దీంతో.. రెండు వారాల గ్యాప్లో రానున్న ఈ పాన్ ఇండియా మూవీస్ పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరి.. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచుతాయేమో చూడాలి.