ఇటలీకి పయనమైన ప్రభాస్ టీమ్
on Oct 1, 2020
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న 'రాధే శ్యామ్' మూవీ లాక్డౌన్ తర్వాత షూటింగ్ను కొనసాగించడానికి సిద్ధమైంది. ఇటలీలో ఓ 15 రోజుల షెడ్యూల్ను జరిపేందుకు చిత్ర బృందం ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగా నేడు ఇటలీకి యూనిట్ బయలుదేరింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చాడు ప్రభాస్. ఇంకేముంది.. జనాలు కెమెరాలకు పని కల్పించారు. ప్రభాస్ను ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.
రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని యు.వి. క్రియేషన్స్తో పాటు కృష్ణంరాజు సొంత నిర్మాణ నిర్మాణ సంస్థ గోపీకృష్ణా మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి. ప్రభాస్ తల్లిగా ఈ చిత్రంలో అలనాటి అందాల తార భాగ్యశ్రీ నటిస్తుండటం విశేషం. 'మిర్చి' మూవీతో నదియాను టాలీవుడ్కు అనేక సంవత్సరాల తిరిగి తీసుకొచ్చిన ప్రభాస్, ఇప్పుడు అదే తరహాలో భాగ్యశ్రీని చాలా కాలం తర్వాత టాలీవుడ్లోకి తీసుకొస్తున్నాడు. అందమైన లవ్ స్టోరీతో రూపొందుతోన్న 'రాధే శ్యామ్' సినిమాపై అంచనాలు ఎప్పటిలాగే అంబరాన్ని చుంబిస్తున్నాయి.
Also Read