వచ్చే ఏడాదికి వాయిదాపడ్డ ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా?
on Mar 24, 2020
నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటించనున్న సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదికి వాయిదా పడనున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. కారణం ప్రభాస్ ప్రస్తుత సినిమా 'ఓ డియర్' షూటింగ్లో జాప్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం! అవును. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న 'ఓ డియర్' మూవీ షూటింగ్ కరోనా వ్యాప్తి భయాందోళనల మధ్య ఆగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నలాక్డౌన్ పరిస్థితుల మధ్య ఏప్రిల్లోనూ ఆ సినిమా షూటింగ్ కొనసాగే అవకాశాలు అతి స్వల్పంగా ఉన్నాయి. అనేక ఐరాపా దేశాలు మే నెల వరకూ విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించాయి కాబట్టి, ఎక్కువగా విదేశీ నేపథ్యం ఉన్న 'ఓ డియర్' మూవీ షూటింగ్పై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా.
అంతర్జాతీయ విమానాల రాకపోకలపై భారత్ ఆంక్షలు విధించడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో జార్జియా షెడ్యూల్ను అర్ధంతరంగా ముగించి ప్రభాస్ బృందం హైదరాబాద్కు తిరిగి వచ్చేసింది. పూజా హెగ్డే అయితే కేవలం మూడు రోజుల పాటే అక్కడి షూటింగ్లో పాల్గొంది. పరిస్థితులు మెరుగుపడి తిరిగి జార్జియాకు వచ్చి షూటింగ్ చేసుకోవచ్చనే ఆశావాదంతోనే యూనిట్ అక్కడి నుంచి మధ్యలో వచ్చిందని సమాచారం. 2020 దీపావళి లేదా క్రిస్టమస్కు ఈ సినిమాని విడుదల చేయాలనేది ఓ డియర్ నిర్మాతల ఆలోచన. కానీ కరోనా నేపథ్యంలో అది జరిగే అవకాశాలు కనిపించడం లేదు. 2021 వేసవికి ఈ సినిమా విడుదల వాయిదా పడవచ్చని ఫిల్మ్నగర్లో ప్రచారం జరుగుతోంది.
దీని ప్రభావం నాగ్ అశ్విన్తో ప్రభాస్ చేసే సినిమాపై పడుతోంది. నిజానికి వచ్చే అక్టోబర్లో విజయదశమికి ఈ చిత్రాన్ని ప్రారంభించాలనేది నిర్మాత సి. అశ్వినీదత్ ఆలోచన. ఆ వెంటనే సెట్స్ మీదకు వెళ్లాలని కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పడు ఆ ప్లాన్ను మార్చుకోవాల్సి వస్తోంది. దసరాకు లాంఛనంగా సినిమాని ప్రారంభించి, 2021లో రెగ్యులర్ షూటింగ్లోకి వెళ్లవచ్చనేది తాజా సమాచారం. ఇంటర్నేషనల్ మూవీగా భారీ బడ్జెట్తో ఈ సినిమాని రూపొందించనున్నారు.
Also Read