'సీసీసీ'కి నేటి విరాళాలు.. ప్రభాస్ 50 లక్షలు, బన్నీ 20 లక్షలు!
on Mar 30, 2020
కరోనా వైరస్ దెబ్బకు షూటింగ్లు నిలిచిపోవడం వల్ల ఆదాయం లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి చైర్మన్గా ఏర్పాటైన 'కరోనా క్రైసిస్ చారిటీ' (సీసీసీ)కి విరాళాలు వచ్చి పడుతూనే ఉన్నాయి. సోమవారం కూడా పలువురు సెలబ్రిటీలు, నిర్మాణ సంస్థలు తమకు తోచినంతలో సీసీసీకి విరాళాలు ప్రకటించారు. ఇప్పటికే ప్రధాని సహాయ నిధికి రూ. 3 కోట్లు, ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ. 50 లక్షలు ప్రకటించిన హీరో ప్రభాస్ ఈ రోజు సీసీసీకి మరో రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ, కేరళ సీఎం సహాయ నిధులకు కలిపి ఇప్పటికే రూ. 1.25 కోట్ల విరాళం ప్రకటించిన అల్లు అర్జున్ ఇప్పుడు వాటికి అదనంగా సీసీసీకి మరో రూ. 20 లక్షల విరాళం ప్రకటించారు. మొత్తంగా ఈ రోజు సీసీసీకి విరాళాలు ఎవరెవరు ప్రకటించారంటే...
హీరో ప్రభాస్ - రూ. 50 లక్షలు
హీరో అల్లు అర్జున్ - రూ. 20 లక్షలు
యువీ క్రియేషన్స్ - రూ. 10 లక్షలు
నిర్మాత కరాటం రాంబాబు - రూ. 1 లక్ష
హీరో సుమంత్ - రూ. 2 లక్షలు
నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది (షైన్ స్క్రీన్స్) - రూ. 5 లక్షలు
హీరో సందీప్ కిషన్ - రూ. 3 లక్షలు
నటుడు బ్రహ్మాజీ - రూ. 75 వేలు